భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

0
51

స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల 875 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 290 పాయింట్లు క్షీణించి 17వేల 270 వద్ద కొనసాగుతోంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్​పర్సన్ జెరోమీ పావెల్ చేసిన ప్రసంగం భారతీయ స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయేందుకు కారణమైంది. అగ్రరాజ్యంలో అంతకంతకూ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఆమె స్పష్టం చేశారు.