ఎయిర్​టెల్​ బాటలోనే వొడాఫోన్​ ఐడియా..కస్టమర్లకు షాక్​..త్వరలో జియో కూడా..

Vodafone Idea on Airtel route..soon Geo too ..

0
36

వొడాఫోన్​ ఐడియా తన కస్టమర్లకు పెద్ద షాక్​ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్​ వొడాఫోన్​ ఐడియా కూడా ఎయిర్​టెల్​ బాటలోనే పయనించింది. మొబైల్​ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

మొబైల్​ కాల్స్​, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్​ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 28 రోజుల కనీస రీఛార్జ్​ ప్లాన్​ ధరను 25.31 శాతం పెంచింది. పాత ధర రూ. 79 ఉండగా..ఇప్పుడు రూ. 99కి చేరింది.

ధరలను పెంచుతున్నట్లు ఎయిర్​టెల్​ ప్రకటించిన మరుసటి రోజే వొడాఫోన్​- ఐడియా కూడా రేట్లు పెంచడం గమనార్హం. వీటి బాటలోనే రిలయన్స్​ జియో కూడా త్వరలో రేట్లు పెంచనుందని తెలుస్తోంది.