హరియాణాలో దారుణం – మైనర్ బాలికపై కామాంధుల అరాచకం

0
36

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. వీరి ఆకృత్యాలకు అమాయక చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. హరియాణా చరఖీ దాదరీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

17 ఏళ్ల మైనర్ బాలిక ఒంటరిగా ఉండడంతో  బాలికపై​ ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటి దగ్గరే ఉండి 12వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇంటి దగ్గర బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టారు నిందితులు. ఆమెను అపహరించి.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు షెడ్యూల్డ్​ కులానికి చెందిన బాలిక.