జూబ్లీహిల్స్ గ్యాంగ్‌ రేప్‌​ కేసులో కీలక ఘట్టం పూర్తి

0
35

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. నేడు ఈ కేసుకు సంబంధించి కీలక ఘట్టం పూర్తయింది. నిందితులను గుర్తించే ప్రక్రియను పోలీసులు ఇవాళ పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను చేపట్టిన పోలీసులు.. బాధిత బాలిక పోలీసులకు వివరాలు తెలిపింది. కాగా మే 28వ తేదీన ఈ గ్యాంగ్‌ రేప్‌ జరగగా..మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సాదుద్దీన్‌(18) ప్రధాన నిందితుడు (ఏ-1) కాగా..మిగిలిన ఐదుగురు మైనర్లు.