అగ్నిపథ్ రద్దుకై కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష..రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0
31

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. తాజాగా అగ్నిపథ్ కు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి కూడలిలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా’? అని ఆయన ప్రశ్నించారు.

‘ఈడీ దాడులకు కాంగ్రెస్‌ భయపడదు..మోదీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఈడీతో దాడులు చేయించినా కాంగ్రెస్‌ భయపడదు. రైతులు, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్‌ గుర్తించింది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవాన్​లను అవమానించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోంది. నాలుగేళ్లు సైన్యంలో పని చేసి ఆ తర్వాత బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా అని సూటిగా ప్రశ్నించారు.

పార్టీలకు అతీతంగా కాపాడుకోవాలి.. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదు. మాజీ సైనికుల హోదా లేదు. పింఛన్‌ రాదు. సికింద్రాబాద్ అల్లర్ల సందర్భంగా తెలంగాణ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను దిల్లీలో ఉన్న కేటీఆర్‌ కోరాలి. పార్టీలకు అతీతంగా యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్య్రాన్ని పణంగా పెట్టడమా? కోటి జనాభా లేని ఇజ్రాయెల్‌తో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను పోలుస్తారా అని రేవంత్ విమర్శించారు.