Accident: యూపీలో ఘోర ప్రమాదం..8 మంది దుర్మరణం

0
58

యూపీలోని లఖిమ్ పురి ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శారదా నది వంతెనపై ఓ ట్రక్కు-బస్సు ఢికొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.