దొంగనోట్ల ముఠా గుట్టురట్టు..ఆరుగురు అరెస్టు

Gang of robbers conspired to arrest six

0
38

ఏపీ: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించారు.

ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే నిందితులు ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేటతెల్లం అయింది. దీనితో నిందితులపై 489B, 489C, r/w 34 IPC యాక్ట్ లపై కేసు నమోదు చేశారు. వారి వద్ధ నుంచి 1,50,000 అసలు నోట్లు, 12,00,000 నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం చేస్తుకున్నారు.

ఇటువంటి ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా సూచించారు. ఈ ప్రెస్ మీట్ లో పోలవరం డీఎస్పీ లత కుమారి, పోలవరం సిఐ ఎఎన్ఎన్ మూర్తి, ఎస్సై ఎ.జయబాబు, బుట్టాయిగూడెం పోలీసులు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.