9వ తరగతి విద్యార్థుల ప్రేమ..పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

0
27

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీనితో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఫాక్స్ సాగర్ లో దూకి ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య  చేసుకోవడంతో సమాచారం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్‌ మార్టంకు తరలించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.