విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి

-

విజయవాడలో(Vijayawada) ఓ కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లాకు చెందిన కారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్‌ను అనుచరులు తొలగించారు. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి డ్రైవర్‌తో కలిసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...