Breaking News- సీనియర్ జర్నలిస్ట్ ఆత్మహత్య..సూసైడ్ నోట్ కలకలం

0
41

ఆర్ధిక ఇబ్బందులతో వార్త ప్రత్రిక రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. యాడ్స్ కోసం సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సప్ గ్రూప్ లో పెండింగ్ ఉన్న డబ్బులను వెంటనే చెల్లించాలి అంటూ అందరి ముందు పరువును తీస్తున్నారని, తాను మృతి చెందుతున్నట్టు సూసైడ్ ఉత్తరం రాసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన భార్యకు మాత్రం స్థానిక bvrit సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతలక్ష్మారెడ్డిని ఉత్తరంలో కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.