Flash- ఏపీలో టెన్షన్..టెన్షన్..స్వర్ణముఖి నదిలో విద్యార్థులు గల్లంతు!

0
38

ఏపీలో టెన్షన్ నెలకొంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతు కాగా ఓ విద్యార్థి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన వారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. దీనితో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొంది.