బ్రేకింగ్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
43

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో జిల్లాలో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. లారీని ద్విచక్రవాహనం ఢికొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పిట్లం మండలం గద్దగుండుతండా వద్ద చోటుచేసుకుంది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందినవారిగా గుర్తించారు.