ఇండియాలో కొత్తగా 16678 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
38

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో అందరిలోనూ భయం నెలకొంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16678 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,39,329 కు చేరింది. ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య విషయానికొస్తే 1,30,713 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,98,88,77,537 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,36,39,329

మొత్తం మరణాలు: 5,25,454

యాక్టివ్​ కేసులు: 1,30,713

కోలుకున్నవారి సంఖ్య: 4,29,83,162