కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి అలర్ట్..ఈ జాగ్రత్తలు పాటించండి..

0
40

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఊహించని ఉపద్రవంలా విరుచుకుపడ్డ వైరస్ బారి నుంచి బయటపడేందుకు ఇప్పటికీ ఎంతో శ్రమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి బారి నుంచి కాపాడేందుకు కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాలపై రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి.

కొన్ని నెలల పాటే సమర్థవంతంగా పని చేస్తాయని, బూస్టర్ డోస్ అవసరమని, కొన్ని రకాల వ్యాక్సిన్లు వేసుకున్నా వ్యర్థమనిఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో తయారైన స్థానిక కరోనా వ్యాక్సిన్లతో కొంతమంది లుకేమియా బారిన పడ్డారని, భవిష్యత్తులో ఆ వ్యాక్సిన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని వార్తలు వెలువడ్డాయి. చైనాలోని స్థానిక హెల్త్ కమిషన్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాక లుకేమియా బారిన పడిన వారిపై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు ఆ నివేదిక తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైనాలోని 18 ప్రావిన్సులలో ఈ నివేదిక కాపీలను పంచి పెట్టమని ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ప్రచారంలో జరుగుతోంది. హెబెయ్, లియోనింగ్, సిచువాన్, షాంక్సీ ఇలా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ నివేదిక చక్కర్లు కొడుతోంది. చైనా ఆరోగ్య సంస్థ తమ హెల్త్ అధికారులను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించింది.