భారత్ కరోనా అప్డేట్..తగ్గిన యాక్టివ్​ కేసులు..హెల్త్ బులెటిన్ విడుదల

0
41

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

దేశంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 7,591 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.19 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,44,08,132

క్రియాశీల కేసులు: 84,931

మొత్తం మరణాలు: 5,27,799

కోలుకున్నవారు: 4,38,02,993