నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు..మరణాల సంఖ్య ఎంతంటే?

0
32

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఆనందపడే విషయముగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3962 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,72,547గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,416 చేరింది. దేశంలో తాజాగా 26 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,83,92,885 కోట్ల  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,31,72,547

మొత్తం మరణాలు: 5,24,677

యాక్టివ్​ కేసులు: 22,416

కోలుకున్నవారి సంఖ్య: 4,26,25,454