ఏపీ ప్రజలకు భారీ ఊరట..భారీగా తగ్గిన కరోనా కేసులు!

0
39

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 15,193 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 434 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,698 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 4,636 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  14

చిత్తూరు         24

ఈస్ట్ గోదావరి   108

గుంటూరు  62

వైస్సార్ కడప  07

కృష్ణ   66

కర్నూల్  03

నెల్లూరు   20

ప్రకాశం    32

శ్రీకాకుళం 02

విశాఖపట్నం  33

విజయనగరం 07

వెస్ట్ గోదావరి   56