ప్రజలకు భారీ ఊరట..తగ్గిన కరోనా కొత్త కేసులు..నిన్న ఎన్ని నమోదయ్యాయంటే?

0
30

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసులు తగ్గడం ప్రజలకు ఊరట కలిగిస్తుంది.

తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 8,586 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 48 మంది కరోనాతో మరణించారు.

ఒక్కరోజులో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి తగ్గింది. యాక్టివ్​ కేసులు 0.22 శాతంగా ఉంది.

మొత్తం కేసులు: 4,43,57,546

క్రియాశీల కేసులు: 96,506

మొత్తం మరణాలు: 5,27,416

కోలుకున్నవారు: 4,37,33,624