ఇండియా కరోనా అప్డేట్..కొత్తగా 3205 కేసులు..మరణాలు ఎన్నంటే?

0
34

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి జనాలపై విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే అందరు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరిస్తుంది.

నేడు కేసులు అధికంగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3205 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,25,44,689 గా ఉంది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,509కు చేరింది. దేశంలో తాజాగా 31 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 5,23,920కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 189,48,01,203 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.