దేశంలో నేడు ఏడువేలు దాటినా కరోనా కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
35

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మన దేశంలో నిన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు నేడు ఒక్కసారిగా పెరిగి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 7240 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,97,522గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,498కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,59,81,691 కోట్ల  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,31,97,522

మొత్తం మరణాలు: 5,24,723

యాక్టివ్​ కేసులు: 32,498

కోలుకున్న వారి సంఖ్య: 4,26,40,301