నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు..తగ్గిన మరణాలు

0
35

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు నేడు స్వల్పంగా పెరగడం ప్రజలు కాస్త ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,124 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 43,111,372గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,971 కు చేరింది. దేశంలో తాజాగా 17 మంది కరోనాతో మరణించడం జరిగింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,67,44,769 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 43,111,372

మొత్తం మరణాలు: 5,24,507

యాక్టివ్​ కేసులు:14,971

కోలుకున్నవారి సంఖ్య: 4,26,02,714