ఏపీ ప్రజలకు ఊరట..తగ్గిన కరోనా ఉధృతి..మరణాలు ఎన్నంటే?

What is the death toll for the people of AP?

0
136

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 11,571  క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 141 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల 14,729 మంది బాధితులు మృతి చెందారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ నుంచి 450 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌స్తుతం 2,014 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  12

చిత్తూరు         12

ఈస్ట్ గోదావరి   16

గుంటూరు  16

వైస్సార్ కడప  5

కృష్ణ   41

కర్నూల్  0

నెల్లూరు   3

ప్రకాశం    3

శ్రీకాకుళం 1

విశాఖపట్నం  7

విజయనగరం 2

వెస్ట్ గోదావరి   23