పారా మెడికల్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి : జెఎసి

0
41

టిఎస్పిఎస్సీ సభ్యులు కారం రవిందర్ రెడ్డిని మంగళవారం వైద్య ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. ఐక్య వేదిక తరపున కారం రవిందర్ రెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించిన సందర్భంగా సన్మానించారు. 2017 లో వెలువరించిన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ మరియు తదితర పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయగలరని కోరడం జరిగింది.

కోర్టు కేసుల పరిష్కారానికై ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని, స్టాఫ్ నర్సుల సమస్యను పరిష్కరించి ఏ విధంగా రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ జరిపారో అదేవిధంగా మిగతా  క్యాడర్ లకు కూడా జరపాలని కోరారు. సమస్యలను వివరిస్తూ అన్ని కేసుల పరిష్కారానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తీవ్రంగా కృషి చేస్తూ ఉందని తెలుపుతూ, త్వరలోనే అన్ని నియామకాలు పూర్తవుతాయని తెలిపారు. త్వరలోనే పైన తెలిపిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక ప్రతినిధులు డా.రవిశంకర్, డా.షరీఫ్, ఆర్.సుజాత, మంచాల రవిందర్, వీరారెడ్డి, నవీన్, శైలజ, కుమారస్వామి, ఎ.సుజాత, మంజుల, క్రిష్ణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.