నిరుద్యోగులకు శుభవార్త.. 8000 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..పూర్తి వివరాలివే..

0
49

నిరుద్యోగులకు శుభవార్త.ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్ పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే..

భర్తీ చేయనున్న ఖాళీలు: 8000

పోస్టుల వివరాలు:  ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) ఖాళీలు వున్నాయి.

అర్హులు: అభ్యర్థులు 50% మార్కులతో బీఈడీ, పీజీ ఉత్తీర్ణులై ఉంటే PGT పోస్టులకి అర్హులు.

అభ్యర్థులు 50% మార్కులతో బీఈడీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉంటే TGT పోస్టులకి అర్హులు.

అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ, డీఈడీ కలిగి ఉంటే PRT పోస్టులకి అర్హులు.

వయస్సు: ఫ్రెషర్స్ కి 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అదే అనుభవం ఉంటే 57 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: 5 అక్టోబర్ 2022

ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి వివరాల కోసం awesindia.com లేదా register.cbtexams వెబ్‌సైట్ లను సందర్శించండి