కృష్ణం రాజు కూతుళ్లు ఏం చేస్తున్నారో తెలుసా?

0
47

రెబల్ స్టార్, హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ఆయన్ను AIG ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11న తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో కృష్ణం రాజు  కుటుంబ స‌భ్యులు ఏం చేస్తున్నారో తెలుసుకోవ‌డానికి  ఆస‌క్తి చూపిస్తున్నారు.

కృష్ణం రాజుకు ముగ్గురు కూతుళ్లు ఉండ‌గా..అందరూ చదువులో నిమగ్నమై ఫుల్ బిజిగా ఉన్నారు. ఇక మొదటి కూతురు విషయానికొస్తే  లండ‌న్ లో ఎంబీఏ పూర్తిచేసింది. తనపేరు  ప్ర‌సీద. కృష్ణం రాజు రెండ‌వ కుమార్తె పేరు ప్ర‌కీర్తి కాగా తను హైద‌రాబాద్ లోని జేఎన్టీయూలో ఆర్టిటెక్చ‌ర్ కోర్స్ ను నేర్చుకుంటోంది.

కృష్ణం రాజు మూడ‌వ కుమార్తె  సైకాల‌జీలో డిగ్రీ పూర్తి చేసి ఉన్న‌త చ‌దువుల కోసం సిద్దం అవుతోంది.ఇదిలా ఉండగా..రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో అధికారిక లాంఛనాలతో జరిగాయి. కృష్ణం రాజు మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబంలో విషాదం నిండుకుంది.