ఒకే ఈతలో 16 పిల్లలు

ఒకే ఈతలో 16 పిల్లలు

0
148

కర్నూల్ జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది… ఒకే ఈతలో కుందేలు 16 పిల్లలకు జన్మనిచ్చింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలిగ్రామంలో జరిగింది…

అన్వర్ బాష అనే వ్యక్తికి కుందేలు పెంచుకోవడం అంటే సరదా… అయితే ఆయన పెంచుకున్న కుందేలుకు ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది… ఈ పిల్లలను చూసేందుకు చుట్టుపక్క గ్రామస్తులు వస్తున్నారు…

ఇలాంటి సంఘటన అరుదుగా చోటు చేసుకుంటుందని కుందేలు ఒక ఈతలో నాలుగు లేదా ఎనిమిది పిల్లలకు జన్మనిస్తుంది… అరుదుగా 12 పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు.. చాలా చాలా అరుదుగా 16 పిల్లలకు జన్మనిస్తుందని పశువైద్యులు అంటున్నారు…