ఇండస్ట్రీ లో ఎవరు వచ్చిన ఆయన బోణి చేయాల్సిందే..!!

ఇండస్ట్రీ లో ఎవరు వచ్చిన ఆయన బోణి చేయాల్సిందే..!!

0
41

సూర్య సరసన జోడీగా నటించేందుకు మొదట భయపడ్డానని నటి ప్రియ భవాని శంకర్‌ తెలిపింది. ఎస్‌జే సూర్య, ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మాన్‌ స్టర్‌’.ఈ సినిమా రీసెంట్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే ఈ సినిమా దర్శకుడు.. హీరోగా ఎస్‌జే సూర్యను అనుకుంటున్నామన్నారు. దాంతో ఆలోచనలో పడింన.. బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పమని వెళ్ళిపోయారు..

అయితే కథ మొత్తం కామెడీ ట్రాక్‌ ఎక్కువ కాబట్టి రొమాన్స్‌ సన్నివేశాలు పెద్దగా ఉండవు అనుకుని ఓకే చెప్పినా… ఎందుకంటే ఎస్‌జే సూర్య నటించిన సినిమాల్లో రొమాన్స్‌, హాట్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆయనతో నటించాలనగానే కొంచెం భయమేసింది. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది.. సూర్య చాలా మంచి మనిషి, నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు. మొట్టమొదటిసారిగా ఆయన నటించిన చిత్రానికి సెన్సార్‌ నుంచి యూ సర్టిఫికేట్‌ వచ్చిందంటే చూడండి. సో పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. అదే ఎస్‌జే సూర్యతో మరో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ప్రియ భవాని శంకర్‌ తెలిపింది..