Guntur Kaaram | ‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ పాట వచ్చేసింది..

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. ‘ఓ మై బేబీ(Oh My Baby)’ అంటూ సాగే ఈ పాటను శిల్పారావు పాడారు. ఎస్. థమన్ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ‘దమ్ మసాలా’ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇక కొత్త సంవత్సరం కానుకగా మూవీ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

- Advertisement -

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్(Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం(Guntur Kaaram)’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న మూవీ విడుదల కానుంది.

Read Also: అలోవెరా ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ,...