3 లక్షల కోసం భార్య పిల్లలను అమ్మిన ప్రబుద్ధుడు..!!

3 లక్షల కోసం భార్య పిల్లలను అమ్మిన ప్రబుద్ధుడు..!!

0
39
OLYMPUS DIGITAL CAMERA

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎవరైనా ఇల్లు తాకట్టు పెడతారు, లేదంటే ఇంట్లోని వస్తువుని తాకట్టుపెట్టుకుంటారు కానీ ఓ ప్రబుద్ధుడు సొంత భార్య పిల్లలని తాకట్టు పెట్టాడు.. నిజంగా ఇది జరిగింది.. అందులో ఇది జరిగింది ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే.. చంద్రయాణ్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ని నూరీ నగర్ లో ఈ ఘటన జరిగింది..

స్థానికంగా నివసించే రెహమాన్ రహ్మాణి, కి ఇష్రాత్ తో రెండేళ్ల క్రితం వివాహమైంది.. ఈ క్రమంలో వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టగా, మగపిల్లాడిని కనలేదని ఆమె భర్త మరుదులు వేధించేవారు.. అయితే ఇటీవలే షాద్ నగర్ లో పనుందని చెప్పి చెప్పి వెల్లిన భర్త ఇంతకీ రాలేదు.. అప్పుడే సర్ఫరాజ్ ఖాన్, అంజాద్ ఖాన్ అనే ఇద్దరు వచ్చి ఇల్లు మాదే అంటూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా పర్వీన్ వారిని అడ్డుకుంది. అయితే వచ్చిన వారిద్దరూ నీ భర్త నిన్ను నీ పిల్లలని, ఈ ఇంటిని మూడు లక్షలకు అమ్మేసింది చెప్పారు.. నన్ను అమ్మేయడం ఏంటని గట్టిగ అరిచి అందరిని పిలవగా అందరు ఆమెకి బాసటగా నిలిచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.