డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవేదన

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవేదన

0
40

దేశంలో జరుగుతున్న హత్యాచార ఘటనలపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించారు… దేశంలో 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని ఆందోళన చెందారు… ప్రతీ రోజు 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు,…

మహిళలపై ప్రతీ రోజు దాదాపు 4 లక్షల పైగా దాడులు జరుగుతున్నాయని అన్నారు… మహిళల న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. దేశంలో ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే పోరాడాల్సి వస్తోందిని అన్నారు..

దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతీ అమ్మాయికి జరగాలని ఆయన కోరారు… ఆగస్టు 15రోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే మరోవైపు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారని ఇది ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు పూరి..