విజయ్ దేవరకొండపై ఉన్న ప్రేమను బయటపెట్టిన సమంత!

-

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)-సమంత(Samantha) కాంబినేషన్‌లో ఖుషీ అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్స్ అండ్ సాంగ్‌కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది.

- Advertisement -

షూటింగ్ గ్యాప్‌లో విజయ్, సమంత(Samantha) ఓ రెస్టారెంట్‌ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. అనంతరం విజయ్ దేవరకొండని ఉద్దేశించి సమంత ఓ పోస్ట్ పెట్టింది. ‘నీ బెస్ట్ చూశాను, నీ వరస్ట్ చూశాను, నువ్వు లేట్‌గా వచ్చినప్పుడు, ముందు వచ్చినప్పుడు చూశాను. నీ సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. కొంతమంది స్నేహితులు మన పక్కనే నిలబడతారు. ఖుషీ షూటింగ్ మొదలు పెట్టి సంవత్సరం అవుతుంది. ఇది నా లైఫ్‌లో అద్భుతమైన సంవత్సరం” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ స్పెషల్ పోస్ట్ వైరల్‌గా మారింది. సామ్, విజయ్ ఫ్యాన్స్‌ ఈ ఫొటోలను నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు.

Read Also:
1. పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
2. రజినీకాంత్ ‘జైలర్’ నుంచి సూపర్ అప్‌డేట్
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...