విశాల్ పని అవుట్.. రంగంలోకి ప్రభుత్వం.ఇకపై డమ్మీనేనట..!!

విశాల్ పని అవుట్.. రంగంలోకి ప్రభుత్వం.ఇకపై డమ్మీనేనట..!!

0
42

తమిళ సినీ నిర్మాతల మండలిలో చాల రోజులనుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. నిర్మాతలు మండలికి విశాల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచే కొందరు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు.. తరచు విశాల్ మీద ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. విశాల్ అండ్ టీం నిధుల దుర్వినియోయాగానికి పాల్పడుతున్నారని తరచు వాదన వినిపిస్తుండగా ఈ ఆరోపణలు ఎంత వరకు నిజాలు అనే విషయం తేల్చడానికి తమిళ నాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది..

తమిళ నిర్మాతలు మండలి కార్యకలాపాలు, వ్యవహారాలు సంవత్సరం పాటు పర్యవేక్షించేలా ఎన్ శేఖర్ అనే పర్యవేక్షణ కమిటీ ని నియమించింది. ఈ చర్యతో ప్రభుత్వం విశాల్ ని డమ్మీ ప్రెసిడెంట్ చేసిందని చర్చించుకుంటున్నారు..