ఇంకా కొన్ని రోజులే.. రిటర్న్ గిఫ్ట్ తప్పదు – రామ్ గోపాల్ వర్మ..!!

ఇంకా కొన్ని రోజులే.. రిటర్న్ గిఫ్ట్ తప్పదు - రామ్ గోపాల్ వర్మ..!!

0
48

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ని ఆంధ్ర లో రిలీజ్ అవనీకుండా చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి పై ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి విమర్శలు వర్షం కురిపించాడు.. ఆదివారం విజయవాడలో ప్రెస్ మీట్ చేసేందుకు వర్మ తో కలిసి రాగ వారిని ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించారు. దీంతో వారు సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ప్రెస్ మీట్ నిర్వహించనివ్వకుండా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కుని చేశారని ఆరోపించారు.. పొలిసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తమను అడ్డుకున్నారని, దీనివెనుక ముఖ్య నాయకులందరినీ బయటికి తీసుకువస్తానని, తప్పకుండ పోరాటం చేస్తామని అన్నారు.. సినిమా విడుదల అయిన తర్వాత ఎవరిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.. కొన్ని రోజులే వాళ్ళు ఇప్పటికే తెలంగాణాలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.. ఆంధ్ర లో ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు.. దీని పరిణామమే మే 23 న ఎదుర్కుంటారు.. అని టీడీపీ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు రాకేష్ రెడ్డి..