RBI సంచలన నిర్ణయం.. దేశంలో రూ.2 వేల నోట్లు రద్దు

-

రూ.2 వేల నోట్ల చెలామణిపై ఆర్బీఐ(RBI) సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆ నోట్లు నిల్వ చేసుకున్న వారంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, రెండు వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈనెల(మే) 23 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ(RBI) స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా నోట్లు రద్దు చేసినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....