రైల్వే ట్రాక్ పై పడ్డ బస్సు … నలుగురు మృతి

-

రాజస్థాన్(Rajasthan) లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 గురు అక్కడికక్కడే మరణించారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. 30 మంది ప్రయాణికులతో హరిద్వార్ నుండి జైపూర్ వెళ్తున్న బస్సు ఢిల్లీ – జైపూర్ హై వే పై దౌసా జిల్లా కలెక్టరేట్ సమీపంలోని బ్రిడ్జి పై నుండి రైల్వే ట్రాక్ పై పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రెస్క్యూ  ప్రారంభించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అంబులెన్సులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిసున్నారు.

- Advertisement -

Rajasthan | జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రాజ్ కుమార్ కస్వ యాక్సిడెంట్ స్పాట్ కి ఇన్వెస్టిగేషన్ కోసం సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ పంపించారు. బ్రిడ్జి కి ఉన్న రేలింగ్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బస్సు రైల్వే ట్రాక్ పై పడడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మృతి చెందిన 4 గురు 23 ఏళ్ళ సుఖ్వీందర్ సింగ్, 4 ఏళ్ళ అన్ష్దీప్ కౌర్, అంగ్రేజ్ సింగ్ మరియు సిమ్రాన్ గా గుర్తించారు.

Read Also: కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలి – ఆర్ఎస్పీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...