ఇండియా టుడే సర్వేలో కర్ణాటకలో ఆ పార్టీదే అధికారం?

-

మరో వారం రోజుల్లోనే కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఓపినీయన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేయగా.. తాజాగా ఇండియా టుడే-సీఓటర్ సర్వే కూడా కాంగ్రెస్(Congress) పార్టీదే విజయమని తన సర్వేలో వెల్లడించింది.

- Advertisement -

224 సీట్లు ఉన్న కర్ణాటక(Karnataka) ఎన్నికల్లో అధికార బీజేపీ కేవలం 74-86 స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. 2018లో సాధించిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఈసారి వస్తాయని పేర్కొంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 107-119 వరకు సీట్లను గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. కుమారస్వామి జేడీఎస్ పార్టీ 23 నుంచి 35 స్థానాల్లో గెలవచ్చని సర్వేలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం సమస్య ముఖ్యభూమిక పోషించబోతుందని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది.

Read Also:
ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లానే ఇది: టీడీపీ ఎంపీ
చీకోటి ప్రవీణ్‌ను దేశం నుంచి బహిష్కరించాలి

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...