జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం సక్సెస్

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్12(GSLV F12) ప్రయోగం విజయవంతం అయింది. నిరంతరాయంగా 27:30 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12(GSLV F12) వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించిందని ప్రయోగం అనంతరం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. భారతదేశానికి చెందిన రోండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. దీని బరువు 2,232 కిలోలు. 12 సంవత్సరాల పాటు దేశీయ నేవిగేషన్ సేవలు అందించేలా శాస్త్రవేత్తలుఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రయోగం సక్సెస్ కు కారణమైన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. త్వరలో నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

Read Also:
1. కొత్త పార్లమెంట్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
2. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...