మహిళల గురించి నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

-

మహిళలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాల అహంకార కూటమిలోని కీలక నేత నితీశ్ కుమార్.. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారని మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. కూటమిలోని ఏ ఒక్కనేత కూడా నితీశ్‌ మాటలను ఖండించలేదన్నారు. మహిళల గురించి చులకనగా మాట్లాడేవారు ప్రజలకు మంచి పనులు ఏం చేస్తారని మోదీ(PM Modi) ప్రశ్నించారు.

- Advertisement -

ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందన్నారు. భార్య చదువుకుంటే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చదువుకున్న మహిళలకు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో నితీశ్ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండని కోరారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాత్రం నితీశ్‌కి మద్దతుగా నిలిచారు. ఆయన కేవలం సెక్స్ ఎడ్యుకేషన్‌ గురించి మాత్రమే ఆయన మాట్లాడారని ఇందులో తప్పేముందని తెలిపారు.

Read Also: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. నోటీసులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...