మొబైల్ వినియోగదారులకు శుభవార్త..అదిరిపోయే పీచర్లతో జియోఫోన్‌ 5G

Good news for mobile users..Geophone‌ 5G with amazing features

0
116

 మొబైల్‌ ఫోన్‌ల విపణిలో మరో సంచలనానికి జియో సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌, జియో ఫీచర్‌ ఫోన్‌, జియోఫోన్‌ నెక్స్ట్‌తో అదరగొట్టిన ముకేశ్‌ అంబానీ టీమ్‌ ఇప్పుడు 5జీ జియో ఫోన్‌ మీద దృష్టి పెట్టిందని సమాచారం. ఈ మేరకు ఇండియాలో జియోఫోన్‌ 5G ఒరవడి ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం వుందని ముకేశ్‌ అంబానీ టీమ్‌ పేర్కొంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ వెబ్‌సైట్‌ ఈ మొబైల్‌కి సంబంధించి వివరాలు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ మొబైల్‌ టాక్‌ ఆఫ్‌ ది టెక్‌ ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుత మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ చాలానే లభిస్తున్నా కూడా జియోఫోన్‌ 5G  పీచర్లు తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుత మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ చాలానే లభిస్తున్నా కూడా అవన్నీ కూడా 15 వేల కంటే ఎక్కువ ధరలో ఉండగా, జియో మాత్రం JioPhone 5G అందరికి అందుబాటులో రూ.9,000 నుండి రూ.12,000 మధ్యలో ఉంచవచ్చని కూడా ఈ రిపోర్ట్ తెలిపింది.