చంద్రబాబు అత్తకు జగన్ కీలక పదవి…

చంద్రబాబు అత్తకు జగన్ కీలక పదవి...

0
182

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్త లక్ష్మీపార్వత్రికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి అప్పగించారు…ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది….ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు…

లక్ష్మీపార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు… 2000 సంవత్సరంలో తెలుగు సాహిత్యంలో ఎమ్.ఎ పూర్తి చేసి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు… గతంలో జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుని చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

అంతేకాదు 2019 ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలో వైసీపీ తరపున ప్రచారం చేసి ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలుపుకు కృషి చేశారు… ఒక మాటలో చెప్పాలంటే పార్టీకోసం లక్ష్మీపార్వతి నిస్వార్థంగా పనిచేశారు… అందుకే ఆమెకు జగన్ కీలక పదవిని అప్పజెప్పారు…