అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ- ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

0
40

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్‌ స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా సాయుధ బలగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ను జూలై 1న ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత కోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళలం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం విశాఖపట్నంలో ఎంపికను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరులకు సంబంధించిన సెలక్షన్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామన్నారు. అభ్యర్థులు ఇంకా ఏమైనా సందేహాలుంటే.. 0891-2756959, 0891-2754680 నంబర్లను సంప్రదించాలని సూచించారు రక్షణ శాఖ అధికారులు.