ఫ్లాష్: కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు

0
30
Sonia Gandhi

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జులై 21న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్​ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. ఇప్పుడు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. జులై 21న తమ ఎదుట హాజరుకావాలని వెల్లడించింది.