ఆర్టీసీ సమ్మెలో ఆగిన మరో గుండె

ఆర్టీసీ సమ్మెలో ఆగిన మరో గుండె

0
31

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కొద్దికాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె నేటితో 12 రోజులకు చేరుకుంది… అయినా కూడా ప్రభుత్వం నుంచి చలనం రాలేదు కదా సమ్మె నిర్వహిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది…

వారిని ఉద్యోగాల నుంచి తొగిస్తోంది… దీంతో చాలామంది కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్మికులు మృతిచెందారు… తాజాగా మరో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందారు…

మియాపూర్ డిపో 1 డ్రైవర్ గా పని చేస్తున్న ఎరుకల లక్ష్మయ్య గౌడ్ తీవ్ర ఆందోళనకు గురి అయి మృతి చెందారు… ఇతని సొంత జిల్లా నల్గొండ జిల్లా… వృత్తి రిత్య హైదరాబాద్ లో స్థిరపడ్డారు.. ఇతనికి భార్య కుమారుడు కూతురు ఉన్నారు.