రాజధానిలో సీఎంకు సీమ సెగలు

రాజధానిలో సీఎంకు సీమ సెగలు

0
38

శ్రీ భాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు… రాయలసీమ ప్రాంతాలు అయినటు వంటి కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో అమరావతికి చేరుకుని నిరసనలు చేపడుతున్నారు…

తాజాగా జగన్ తన కాన్వాయి నుంచి బయల్దేరుతుండగా న్యాయవాదులు ప్లకాడ్స్ పట్టుకుని నిరసనలు చేపట్టారు.. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ…

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కోస్తాలో రాజధాని ఉంది కాబట్టి రాయలసీమలో హైకోర్టు ఉండాలని రాయలసీమలో రాజధాని ఉంటే కోస్తాలో హైకోర్టు ఉండాలని తెలిపారు… గతంలో టీడీపీ నాయకులు ఏకపక్షనిర్ణయాలు తీసుకున్నారని వారు మండిపడ్డారు..