అంతా టీడీపీనే చేస్తోందా…

అంతా టీడీపీనే చేస్తోందా...

0
35

రాజకీయ స్వార్ధం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు అధికార వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదు కోట్లు ప్రజల కోరిక, టీటీడీ ఆహ్వానం మేరకు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పిచారని అన్నారు…

ఆలయ ఘటనలపై కావాలనే ప్రభుత్వంలో దుష్ప్రాచారం చేస్తున్నారని ఆరోపించారు… జగన్ కు భర్తి గౌరవం ఏ విధంగా ఉందో అన్ని రాష్ట్రప్రజలు చూశారని అన్నారు… తప్పస్సు చేసేవాలో కనిపించే వెలుగు జగన్ లో కనిపించిందని అన్నారు…

ప్రస్తుతం టీడీపీ హిందూమతం పేరుతో నీచరాజకీయం చేస్తోందని ఆరోపించారు సజ్జల… అమరావతి భూకుంభకోణంపై దృష్టి మరల్చడానికి ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు… టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రభుత్వాన్ని ఏం చేయలేదని అన్నారు…