వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..అకౌంట్లలోకి రూ.10 వేలు

0
37

ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.

రోడ్ల పై తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలు చేసుకోనేవారికి జగనన్న తోడు పేరుతో వడ్డీలేని రుణాలను అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని లక్షలాది మంది చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 న అంటే మరో మూడు రోజులలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయనుంది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను కూడా చేపట్టింది. త్వరలోనే ఈ పథకం కూడా అమలు కానుంది.