బాధతో ట్వీట్ చేసిన చంద్రబాబు

బాధతో ట్వీట్ చేసిన చంద్రబాబు

0
36

ప్రజాపిత బ్రహ్మకుమారి ముఖ్యసంచాలిక జానకి పరమపదించారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.. భవిష్య సమాజ ఉన్నతి కోసం పరితపించిన జానకి దాది క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా భక్తులలో ఆత్మవిశ్వాసం పెంపునకు కృషిచేశారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు… అటువంటి గొప్ప ఆధ్మాత్మికవేత్తను మనమిప్పుడు కోల్పోయామని అన్నారు..

శాంతి, సంతోషం, సకారాత్మక దృష్టి పెంచడం ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షించిన జానకి దాది… సేవారంగం, ఆధ్యాత్మికరంగాలలో చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు రాజయోగ అభ్యాసం, సత్యాన్వేషణ, మానవతా విలువల పెంపు ద్వారా సమాజాన్ని జాగృతం చేశారామోనని అన్నారు.

ఆమె వద్ద నేర్చుకున్న అంశాలు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తున్నాయి. భౌతికంగా జానకి దాది మనకు దూరమైనా… ఆమె స్ఫూర్తి అనుక్షణం మన వెన్నంటే ఉంటుందని అన్నారు. ఆమె చూపిన బాటలో నడవడమే జానకి దాదికి మనం అందించే నివాళి అని చంద్రబాబునాయుడు అన్నారు…