త్యాగం, సేవకు చిహ్నంగా బక్రీద్..శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

0
34

దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయ‌డానికి మ‌న‌లో స్ఫూర్తిని మరింతగా పెంచుతుంద‌ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.  త్యాగం, సేవకు చిహ్నంగా బక్రీద్  పండుగ నిలుస్తుంది. సేవకు మనల్ని మనం అంకితం చేసుకుని దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం అని కోవింద్ ట్వీట్ చేశారు.