పాలమూరు ఘటనపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

0
38

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజి పనుల్లో భాగంగా పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. వీరి మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ స్పందించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.