చంద్రబాబుకు షాక్ సైకిల్ దిగి బీజేపీలో చేరిన కీలక నేత

చంద్రబాబుకు షాక్ సైకిల్ దిగి బీజేపీలో చేరిన కీలక నేత

0
75

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు… దీంతో సైకిల్ తొక్కేవారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది…ఇప్పటికే సుజానా సీఎం రమేష్ వంటి టీడీపీ బడానేతలు సైకిల్ దిగి కమలం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే….

ఆ తర్వాత టీడీపీ కంచుకోట కృష్ణా జిల్లాలో కీలక నేతలు దేవినేని అవినాష్ అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు టీడీపీకి గుడ్ బై చెప్పారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో షాక్ తగిలింది…. టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీలో చేరారు…

నడ్డా రాంమధవ్ సమక్షంలో ఆయన బీజీపీలో చేరారు… కాగా ఎన్నికల సమయంలో ఆయన తిరిగి టీడీపీలో చేరారు… నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి గెలుపు సహాయం చేసినా కూడా టీడీపీ అభ్యర్థి గెలవలేకపోయారు…